English | Telugu

నేను సింగల్...బ్రేకప్ ఒప్పుకున్న త్రిష

వ‌రుణ్‌ మనియన్ తో బ్రేకప్ జరిగిపోయిన విషయాన్ని త్రిష అఫీషియ‌ల్‌గా ప్రకటించింది. ''నా గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వందల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..వాటిని వదిలేయండి..నేను ఆనందంగా సింగల్ గా వున్నాను''అంటూ ట్విట్టర్ లో తెలియజేసింది త్రిష. వ‌రుణ్‌ మనియన్ తో నిశ్చితార్థo తరువాత జాయింటుగా నిర్వ‌హించిన పార్టీలో వచ్చిన గొడవ వీరి బ్రేక‌ప్‌కి దారి తీసింద‌ని తెలుస్తోంది. ఇన్నాళ్ళు దీనిపై త్రిష స్పందించకపోవడంతో అవన్ని రూమర్లేనని అందరూ అనుకున్నారు. కానీ త్రిష దీనిపై క్లారిటీ ఇవ్వడంతో నిజమని తేలిపోయింది. త్రిష త‌న మ‌న‌సు చెప్పిన‌ట్టు న‌డుచుకొంద‌ని, పెళ్ళి చేసుకొని విడిపోయే బదులు..ఇప్పుడే విడిపోతే మంచిదని భావించినట్టు సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.