English | Telugu

సినీరచయిత తోట ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్

సినీ రచయిత తోట ప్రసాద్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేశారు. ఈ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ప్రముఖ సినీరచయిత తోట ప్రసాద్ వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు. సినీ రచయిత తోట ప్రసాద్ "కంత్రీ, వరుడు, సీతారాముల కళ్యాణం లంకలో, పంచాక్షరి" వంటి చిత్రాలకు సంభాషణలు వ్రాశారు. సినీ రచయిత తోట ప్రసాద్ కి ఇరవై లక్షలు ఖర్చుతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోగల ఆర్థిక స్తోమతు లేదు. కనుక ఆయనకు ఆర్థిక సాయం అందజేయతలచిన దాతలు ఈ దిగువన ఇవ్వబడ్డ బ్యాంక్ ఎకౌంట్ కు డబ్బు పంపవలసిందిగా ప్రార్థన. మనసున్న మానవతా వాదులందరూ సినీ రచయిత తోట ప్రసాద్ కి ఆర్థిక సాయం అందించాల్సిందిగా ప్రార్థన.

టి.యన్. యల్.వి.ప్రసాద్,

యాక్సిస్ బ్యాంక్,

జూబ్లీ హిల్స్ బ్రాంచ్,

ప్రయారిటీ ఎకౌంట్ నంబర్ - 910010007634540 కి డబ్బు పంపవచ్చు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.