English | Telugu

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ లో గోపీచంద్

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ లో గోపీచంద్ నటించనున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో నేటిభారతం, రేపటిపౌరులు, దేవాలయం, ప్రతిఘటన వంటి ఎన్నో సామాజిక స్పృహకలిగిన, ఉన్నత విలువలతో కూడిన సినిమాల్కు దర్శకత్వం వహించిన స్వర్గీయ టి.కృష్ణ కుమారుడు గోపీచంద్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేసినా, విలన్ గా రాణించి, మళ్ళీ హీరోగా రూపాంతరం చెందాడు. గోపీచంద్ ప్రస్తుతం "మొగుడు" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటించటానికి అంగీకరించాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ సినిమా కుటుంబకథా చిత్రంగా రూపొందనుందట. ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు అంటే దర్శకుడెవరు...? హీరోయిన్ ఎవరు...? అన్నవివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.