English | Telugu

పవన్ తీన్ మార్ నైజాం ఎవరిదంటే

ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" మూవీ యొక్క నైజాం ఏరియా పంపిణీ హక్కులు ఎవరికి దక్కాయంటే మల్టీ డైమెన్షన్ కంపెనీకి దక్కాయని వినికిడి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అందాల తార త్రిష హీరోయిన్ గా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం యొక్క నైజాం ఏరియా హక్కులను మల్టీ డైమెన్షన్ కంపెనీ సొంతం చేసుకుందట. ఈ "తీన్ మార్" చిత్రాన్ని అలాంటి పెద్ద కంపెనీ అయితే నైజాం ఏరియాలో మంచి థియేటర్లలో విడుదల చేయగలదని సమాచారం.

ఒక సినిమాని ఎంత బాగా తీసినా ఆ సినిమాని సరైన థియేటర్లలో రిలీజ్ చేయలేకపోతే దాని ఫ్లేవర్ పాడైపోతుంది. చాలా సినిమాలకు గతంలో ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ "తీన్ మార్" చిత్రానికి ఆ పరిస్థితి రాకూడదనే మల్టీ డైమెన్షన్ కంపెనీకి ఈ నైజాం ఏరియా పంపిణీ హక్కులను అందించారని తెలిసింది. ఈ "తీన్ మార్" చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం విశేష ప్రేక్షకాదరణతో ఘనవిజయం సాధించింది. ఈ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన విడుదల చేస్తారని వినిపిస్తున్నా, అది బహుశా సాధ్యపడకపోవచ్చు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.