English | Telugu

రాజ‌మౌళిని ఏకిప‌డేసిన తాప్సి

ఈమ‌ధ్య క‌థానాయిక‌లు మాట‌ల జారుతున్నారు. హీరోల‌పై, ద‌ర్శ‌కుల‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మొన్నామ‌ధ్య రాధిక ఆప్టే... తెలుగు హీరోల ఆధిప‌త్య తీరుపై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాప్సి... రాజ‌మౌళిని టార్గెట్ చేసింది. లోక‌మంతా బాహుబ‌లిని కీర్తిస్తుంటే... ఈ అమ్మ‌డు మాత్రం పెద‌వి విరిచింది. సినిమా గొప్ప‌గా ఉంద‌ని, అయితే హీరోయిన్ల‌ను పోట్ర‌యిట్ చేసిన విధానం ఏమాత్రం బాగోలేద‌ని, రాజ‌మౌళి స్థాయికి ఇది త‌గ‌ద‌ని సూటిగా చెప్పేసింది ఈ పంజాబీ ప‌డుచు.

ముఖ్యంగా అవంతిక పాత్ర‌లో త‌మ‌న్నాని మ‌ల‌చిన విధానంపై విరుచుకుప‌డింది. ఈ పాత్ర ఉద్దేశం ఏమిటో త‌న‌కు అర్థంకాలేద‌ని, మిగిలిన పాత్ర‌ల‌న్నింటికంటే ఆ పాత్ర అధ్వానంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఏకిప‌డేసింది. హీరోయిన్ అంటే.. హీరోల కోసం ప‌డి చ‌చ్చిపోయే పాత్ర‌లుగానే ఎందుకు మ‌లుస్తారో అర్థం కాద‌ని, ఓ క‌థానాయిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

తాప్సి మాట‌ల్లో నిజం లేక‌పోలేదు. ఈ సినిమాలో బ‌ల‌హీన‌మైన పాత్ర అవంతిక‌దే. త‌న‌కేదో పెద్ద ఆశ‌యం ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చి.. చివ‌రికి తాను ఓ సామ‌న్యురాలిగానే ఓ మ‌గాడి ప్రేమ‌కు క‌రిగిపోయి, త‌న‌కి లొంగిపోవ‌డం... ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేదు. ఇలాంటి కామెంట్ల‌ను రాజ‌మౌళి లైట్‌గానే తీసుకొంటాడేమో. కానీ త‌మ‌న్నా మాత్రం కౌంట‌ర్ ఇచ్చే ఛాన్సులున్నాయి. మొత్తానికి చిత్ర‌సీమ‌లో తాప్పి వ‌ర్సెస్ త‌మన్నా వార్ మొద‌ల‌వ్వ‌డానికి బోల్డంత ఆస్కారం ఉంద‌న్న‌మాట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.