English | Telugu

పాపం బండ్లకు హీరోలే లేరు!!

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ ప్రొడ్యూసర్ గా పాపులర్‌ అయిన బండ్ల గణేషే మొదటి నుంచే భారీ బడ్జెట్‌ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఆయనకు ప్రస్తుతం ఏ హీరో డేట్లు దొరకడంలేదట. రేసెంట్ గా చిన్న సినిమాలు తీయనని ప్రతిజ్ఞ చేసిన ఆయనకి ప్రస్తుతం కొత్త సినిమా సంగతేంటో తెలియట్లేదు. తన ఫేవరెట్‌ మెగా హీరోలందరూ వేరే కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్ కూడా తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. తీస్తే స్టార్‌ హీరోలతోనే తీస్తానని పట్టుబట్టే బండ్లకు ఎవరూ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని తన స్థాయిని కాస్త తగ్గించుకుని నితిన్‌తో ఓ సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడట. దీనికి పూరి జగన్నాథ్‌ను దర్శకుడిగా సెట్‌ చేసే పనులలో ప్రస్తుతం బిజీగా వున్నాడట. ఐతే ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మి’తో బిజీగా వున్నా పూరి రెండు నెలలు ఆగమని చెప్పాడట. సో బండ్ల మరో రెండు ఖాళీ!!

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.