English | Telugu

SSMB29 vs AA22 .. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్..!

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పలు భారీ సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'SSMB29', అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న 'AA22' ప్రధానమైనవి. ఈ సినిమాలకు రూ.2000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగల సత్తా ఉందనే అంచనాలున్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగే అవకాశాలున్నాయనే వార్త.. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేస్తున్నారు. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేలా దీనిని మలుస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు 'AA22' ప్రాజెక్ట్ ని సైతం 2027 వేసవిని టార్గెట్ చేసుకునే తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. 'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తో గ్లోబల్ మార్కెట్ ని షేక్ చేయాలని.. బన్నీ, అట్లీ భావిస్తున్నారు.

కంటెంట్ పరంగా, కాంబినేషన్ పరంగా, బడ్జెట్ పరంగా ఇలా ఏ అంశం తీసుకున్నా.. 'SSMB29', 'AA22' రెండూ భారీ సినిమాలే. అలాంటిది ఈ రెండూ ఒకేసారి విడుదలైతే మొదట ఏ సినిమా చూడాలో అర్థంకాని పరిస్థితి ప్రేక్షకుల్లో కూడా ఏర్పడుతుంది.

అయితే ఈ తరహా భారీ సినిమాలకు సోలో రిలీజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాగ్జిమమ్ థియేటర్లలో సినిమాను విడుదల చేయాలి. అలాంటిది ఒకేసారి రెండు భారీ సినిమాలు వస్తే.. థియేటర్ల సమస్య వస్తుంది. కలెక్షన్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉంటే మంచిది. 'SSMB29', 'AA22' రెండు మూవీ టీంలు మాట్లాడుకొని అందుకు తగ్గట్టుగా రిలీజ్ ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.