English | Telugu

బిపాసాతో శ్రీ స్టెప్పులు..!

క్రికెటర్ నుంచి యాక్టర్‌గా మారిన భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రస్తుతం మళయాళ చిత్రం టీమ్-5లో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసు ఐటెం సాంగ్‌ చేయనుంది. దీనిలో బిపాసాతో పాటు శ్రీ కూడా చిందేయనున్నాడు. ముందు ఈ పాట కోసం సెక్సీబాంబ్ సన్నీలియోనీని అనుకున్నారు. అయితే సన్నీ కోటి డిమాండ్ చేసేసరికి చిత్ర యూనిట్‌ బిపాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని చిత్రబృందం తెలిపింది. శ్రీశాంత్‌కి డ్యాన్స్‌లో మంచి టాలెంట్‌ ఉంది. ఎన్నో షోల్లో, స్టేజిల మీద శ్రీశాంత్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మరి అలాంటి శ్రీశాంత్ పక్కన డ్యాన్స్ చేయాలంటే చక్కగా డ్యాన్స్‌ చేయగలిగే నటిని ఎంచుకోవాలనుకుంది ఆ మూవీ యూనిట్. అసలే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న బిపాసా ఇందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.