English | Telugu

శంకర్ ఉండగా...టెన్షన్ దండగా..!!

'బాహుబలి' సెట్‌ చేసిన హై స్టాండర్డ్స్‌ను 'రోబో-2' ద్వారా అధిగమించి తీరాలన్న కృత నిశ్చయంతో ఉన్న శంకర్‌ తన సినిమాను ప్రారంభి౦చాడు. ఓ సౌత్‌ ఇండియన్‌ మూవీ మీద ఏకంగా రూ.400 పెట్టుబడికి ఒప్పించడమంటే మాటలు కాదు. ఇది శంకర్‌ కు మాత్రమే సాధ్యమయ్యే ఘనత. ఐతే ఊరికే బడ్జెట్‌ పెట్టించేసి హంగామా చేసే టైపైతే కాదు శంకర్‌. ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ తెరమీద చూపిస్తాడు. ఆ మొత్తాన్ని రాబట్టడానికి పక్కా ప్రణాళికా రచిస్తాడు. కాబట్టి నిర్మాతలు టెన్షన్‌ పడాల్సిందేమీ లేదు.ఇండియాలోనే అత్యధికంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. రజినీ సరసన అమీ జాక్సన్‌ ఈ సినిమాలో కథానాయికగా నటించనుంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .