English | Telugu

షారుఖ్ సినిమాపై మెంటల్ టార్చర్ కేసు..!

ఇండియాలో ఎవరు ఎవరిమీదైనా కేసు పెట్టేసుకోవచ్చు. అందులోనూ ఒక్కోసారి విచిత్రమైన కేసులు కూడా ట్రై చేయచ్చు. వీటి వలన పబ్లిసిటీయే కాక, కేసు గెలిస్తే డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. రీసెంట్ గా రిలీజైన షారుఖ్ ఫ్యాన్ సినిమాపై ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. ముంబైకి చెందిన సంగీత అనే ఆమె షారుఖ్ , పివిఆర్ సినిమాస్, యశ్ రాజ్ ఫిలిమ్స్ పై ముంబై కోర్టులో కేసు వేసింది. ఫ్యాన్ సినిమాలో జబ్రా సాంగ్ కోసం తాను, తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యాన్ సినిమాకు వెళ్లానని, టిక్కెట్ కు 650 రూపాయలు చెల్లించానని, కానీ సినిమాలో ఆ పాట లేకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఆరోపిస్తున్నారు. తమను మానసికంగా వ్యథకు గురి చేసినందుకు పరిహారంగా టిక్కెట్ డబ్బులు 2,600 వెనక్కివ్వడంతో పాటు, యాభైవేల రూపాయలు పరిహారం చెల్లించాలని కోర్టును కోరుతున్నారు. ఈ కేసు రేపు విచారణకు రానుంది. కాగా, ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి 52.35 కోట్లతో షారుఖ్ ఫ్యాన్ 2016 బాలీవుడ్ సినిమాల్లో రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకూ మొదటి ప్లేస్ లో ఉన్న అక్షయ్ కుమార్ ఎయిర్ లిఫ్ట్ సెకండ్ ప్లేస్ కు పడిపోయింది. సినిమాకు డివైడ్ టాక్ వస్తున్నా, ఫ్యాన్ కు కలెక్షన్లు మళ్లీ స్టడీ అవడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.