Read more!

English | Telugu

రాజ్ తరుణ్ సరసన సాయేషా!

అక్కినేని అఖిల్ సరసన "అఖిల్" సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కథానాయకి సాయేషా. అన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ది డెకేడ్ గా నిలవడంతో సాయేషా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, "అఖిల్" సినిమా విడుదలకి ముందే హిందీలో అజయ్ దేవగన్ సరసన "శివాయ్" సినిమాలో కథానాయికగా నటించే అవకాశం దక్కించుకొన్న సాయేషా.. "అఖిల్" రిజల్ట్ అనంతరం ముంబై జంప్ అయిపోయింది. అయితే.. ఈ అమ్మడు తెలుగులో మరో అవకాశం దక్కించుకొందని తెలుస్తోంది. రాజ్ తరుణ్ కథానాయకుడుగా "దొంగాట" ఫేమ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో సాయేషాను కథానాయికగా ఎంపిక చేసుకొన్నారట. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి అమ్మడు షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఎకె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగిపోయిందని రెండ్రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే!