English | Telugu

గత నాలుగు రోజుల్లో సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్లు..!

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మొదటి రోజు చాలా చోట్ల మిక్సడ్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్లలో మాత్రం ఆ రోజు చాలా చోట్ల బాహుబలి రికార్డ్లను తిరగరాసింది. డివైడ్ టాక్ తర్వాతి రోజు నుంచి కలెక్షన్లపై ప్రభావం చూపించింది. మొదటి నాలుగురోజుల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 34.40 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది సర్దార్. ఈ సినిమా ఏరియా వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 10.60 కోట్లు
కృష్ణా - 2.41 కోట్లు
సీడెడ్ - 6.61 కోట్లు
నెల్లూర్ - 1.30 కోట్లు
గుంటూర్ - 3.36 కోట్లు
ఈస్ట్ గోదావరి - 3.19 కోట్లు
వెస్ట్ గోదావరి - 3.33 కోట్లు
వైజాగ్ - 3.60 కోట్లు

టోటల్ - 34.40 కోట్లు

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.