English | Telugu

సంజూబాబా ఆ హాలీవుడ్ యాక్టర్ లా చేస్తాడట..!

వయసైపోయినా హీరోగానే ఫీలవుతుంటారు సినీహీరోలు. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ, తాత వయసొచ్చేసినా ఇంకా హీరోయిన్లతో రొమాన్స్ చేయడం కామనే. కానీ తాను మాత్రం దీనికి వ్యతిరేకమంటున్నాడు సంజయ్ దత్. జైలు నుంచి విడుదలైన తర్వాత రెస్ట్ తీసుకుంటున్న ఖల్ నాయక్, తన సెకండ్ ఇన్నింగ్స్ లో కమర్షియల్ సినిమాలు, తాను ప్రేమించాల్సి వచ్చే కథలు చేయనని ఘంటాపథంగా చెబుతున్నాడు. కేవలం స్టోరీ బేస్డ్ సినిమాలు, తన వయసుకు తగ్గ సినిమాలే చేస్తానని, మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడమే తన లక్ష్యమంటున్నాడు. " ఇప్పుడు నాది ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ వేసే వయసు కాదు. జైలు జీవితంలో చాలా నేర్చుకున్నా. ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా ఉన్నా. తర్వాత నా బయోపిక్ తర్వాత, మున్నాభాయ్ సీక్వెల్, ఆ తర్వాత విధు వినోద్ చోప్రా సినిమా చేస్తున్నాను" అంటున్నాడు. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో వయసైన తర్వాత కూడా ప్రత్యేక పాత్రల్లో నటించే లియామ్ నీసన్ లా నటించడానికి ప్రయత్నిస్తానంటున్నాడు. మున్నాభాయ్ డిసిషన్ ను మిగిలిన భాషల్లో సీనియర్లు కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.