English | Telugu

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో నాలుగో సింహం

తన నాన్నకు ప్రేమతో సక్సెస్ తో ఫుల్ కిక్ లో ఉన్న ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ గురించి రోజుకో ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటికి వస్తోంది. కొరటాల శివ ఈ సినిమా కోసం పూర్తిగా భారీ క్యాస్టింగ్ ను చేస్తున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, జనతా గ్యారేజ్ లో, ఎన్టీఆర్ కు తండ్రిగా నాలుగో సింహం సాయికుమార్ ను తీసుకున్నారట. ఇప్పటికే, సినిమాలో మోహన్ లాల్ ను ఎన్టీఆర్ కు పెదనాన్నగా తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబై లో ఉండే ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో హైదరాబాద్ లో కథ జరుగుతుందనేది ఇన్ సైడ్ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో సమంత, నిత్యామీనన్ జత కడుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.