English | Telugu

అమృతగాయని ఎస్ జానకి బర్త్ డే ఈరోజు..!

ఆ ఒక్క గొంతులో వేయి భావాలు పలుకుతాయి. మధురం అన్న పదానికి పర్యాయపదం ఆమె పాట. ఆ గొంతులోనే మలయమారుతంలాంటి పాట వినిపిస్తుంది. ఝంఝామారుతం లాంటి పాట జాలువారుతుంది. గంగా ప్రవాహంలా సాగే ఆ అమృత ఝరిలో దశాబ్దాల పాటు ఎంతోమంది అభిమానులు ఓలలాడారు. తమ గానార్తిని తీర్చుకున్నారు. తన గంథర్వ స్వరంతో పాటకే వన్నె తెచ్చిన ఆ గాయని ఎస్. జానకమ్మ. ఈరోజు ఈ దేవగంథర్వగాయని పుట్టిన రోజు. ఆమె పాడిన ప్రతీపాటా ఆణిముత్యమే అయినా, మచ్చుకు కొన్ని పాటల్ని చూసే ప్రయత్నం చేద్దామా..!

1. సిరిమల్లె పువ్వా..(పదహారేళ్ల వయస్సు)

2. నరుడా ఓ నరుడా (భైరవ ద్వీపం)

3. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (రాక్షసుడు)

4. మౌనమేలనోయి ఈ మరపురాని హాయి (సాగరసంగమం)

5. ఈ దుర్యోధన దుశ్శాసన (ప్రతిఘటన)

6. మగధీర (ఒకే ఒక్కడు)

7. వెన్నెల్లో గోదారి అందం (సితార)

8. ఆకాశంలో ఆశల హరివిల్లు (స్వర్ణ కమలం)

9. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (మంచి మనసులు)

10. అంజలి అంజలి అంజలి (అంజలి)

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.