English | Telugu

'రుద్ర‌మ‌దేవి' వ‌స్తోందోచ్‌!

ఇదిగో వ‌స్తోంది.. అదిగో వ‌స్తోంది.. అంటూ గ‌త కొన్ని నెల‌లుగా వాయిదాల ప‌ర్వంతో వార్త‌ల్లో నిలిచిన 'రుద్ర‌మ‌దేవి' సినిమా ఎట్ట‌కేల‌కు రెడీ ఫ‌ర్ రిలీజ్ అంటోంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు భారీ వ్య‌యంతో నిర్మించిన ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్ చేసింది. 'రుద్ర‌మ‌దేవి'ని సంక్రాంతి, స‌మ్మ‌ర్‌.. ఇలా కొన్ని సీజ‌న్ల టైంలో రిలీజ్‌కి ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ.. టెక్నీక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ రీజ‌న్స్‌తో పోస్ట్‌పోన్ అవుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 26న 'రుద్ర‌మ‌దేవి' రిలీజ్‌కి బెర్త్ సంపాదించుకుంద‌ని గుణ‌శేఖ‌ర్ అండ్ టీమ్‌ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంద‌డి చేయ‌నున్న ఈ సినిమా.. చిత్ర యూనిట్ ప‌డ్డ క‌ష్టాల‌న్నింటిని మ‌రిచిపోయేలా రిజ‌ల్ట్‌ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. అల్లు అర్జున్‌, రానా, నిత్యా మీన‌న్‌, కేథ‌రిన్ ట్రెసా త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన 'రుద్ర‌మ‌దేవి'కి ఇళ‌యరాజా సంగీత‌మందించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.