English | Telugu

రుద్ర‌మ‌దేవి..ఇంకా డిసైడ్ కాలే

గుణ‌శేఖ‌ర్ క‌ష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. స‌మ్మ‌ర్‌లో రావ‌ల్సిన రుద్ర‌మ‌దేవి... జూన్ ముగుస్తున్నా రాలేదు. జూన్ 26న వ‌చ్చేస్తున్నామని గుణ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించినా.. అందుకు సంబంధించిన హ‌డావుడి ఏమీ లేదు. రూ.50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. ప్ర‌చారం ఏ రేంజులో ఉండాలి..??

ప‌ట్టుమ‌ని చూస్తే ఇంకో ప‌ది రోజులు కూడా లేదాయె. అలాంట‌ప్పుడు రుద్ర‌మ‌దేవి ఏ రేంజులో ప‌బ్లిసిటీ చేసుకోవాలి. అయితే గుణ‌శేఖ‌ర్ మాత్రం కామ్‌గా ఉన్నాడు. ఇంత వ‌ర‌కూ చూపించింది ఒక్క ట్రైల‌రే. అదీ.. తేలిపోయింది. మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేయలేదు. మీడియాకి ఇంట‌ర్వ్యూలు కూడా ఇవ్వ‌లేదు. కార‌ణం ఏమిట‌ని ఆరాతీస్తే.. బ‌య్య‌ర్లు ఎవ‌రూ ఈ సినిమాపై సంతృప్తిగా లేర‌ని తెలుస్తోంది.

రుద్ర‌మ‌దేవి రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌గానే ఈసినిమా రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయ‌ని గుణ‌శేఖ‌ర్ భావించాడు. అయితే వాళ్ల నుంచి స్పంద‌న లేదు. ఆది, సోమ వారాలు బ‌య్య‌ర్లతో గుణ‌శేఖ‌ర్ మీటింగులు పెట్టాడు. అయితే అవేం ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల తేదీపై గుణ‌శేఖ‌ర్ ఓ స్ప‌ష్ట‌త తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. జూన‌ఖ 26న గ‌నుక రుద్ర‌మ‌దేవి రాక‌పోతే... ఇక ఇప్ప‌ట్లో అనుష్క సాహ‌సాల్ని వెండితెర‌పై చూడ‌లేం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.