English | Telugu

‘మిమ్మల్ని పవన్‌ భార్యగానే చూస్తాం..’ అభిమాని చేసిన కామెంట్‌పై రేణు రియాక్షన్‌ ఇదే!

రేణు దేశాయ్‌.. ‘బద్రి’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే పవన్‌కళ్యాణ్‌తో ప్రేమలో పడ్డారు. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకొని కొన్ని కారణాల వల్ల 2012లో విడిపోయారు. ఆ తర్వాత మరో వివాహం చేసుకోకుండా తన ఇద్దరు పిల్లలు అకీరానందన్‌, ఆద్యలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు.. అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతుంటారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, వారి కామెంట్లకు స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఓ అభిమాని ‘మేం మిమ్మల్ని ఇంకా పవన్‌ కళ్యాణ్‌ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో వేరొక మగాడిని ఊహించలేం’ అని కామెంట్‌ చేశాడు.

అభిమాని చేసిన కామెంట్‌పై తనదైన శైలిలో స్పందించారు రేణు దేశాయ్‌. ‘ఈ వ్యక్తి సోషల్‌ మీడియాలో చదివి తెలుసుకొని ఇలా కామెంట్‌ చేస్తున్నాడనుకుంటున్నాను. మనం 2025లో ఉన్నప్పటికీ మహిళ భర్త లేదా తండ్రి ఆస్తిగానే భావించే ధోరణి పురుషుల్లో ఇంకా ఉంది. మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వారి అనుమతి కోరుకోవడం తప్పు. మహిళలు వంటగదికి మాత్రమే పరిమితం కావాలని, పిల్లల్ని పెంచి పెద్ద చేసే మనిషిగానే ఉండాలని కోరుకునే మగవారు ఇప్పటికీ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా నా వాయిస్‌ వినిపిస్తాను. నా ధోరణి పట్ల నా ఫాలోవర్స్‌ ఏమనుకుంటారనే దాని గురించి నేను భయపడను. రాబోయే తరాల మహిళల్లో మార్పు తీసుకు రావడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ఫెమినిజం అంటే వీకెండ్‌లో తాగి తిరగడం కాదు. ఆడవారిని పశువులుగా, ఫర్నిచర్‌లా చూసే మైండ్‌సెట్‌ను ప్రశ్నించడమే నిజమైన ఫెమినిజం’ అంటూ రేణూ తన పోస్ట్‌తోపాటు ఆ ఫ్యాన్‌ చేసిన కామెంట్‌ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్‌ చేశారు. ఈ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని ఎంతో ధైర్యంగా చెప్పిన రేణు దేశాయ్‌ను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.