English | Telugu

15 కోట్ల కన్నా పిల్లల ఆరోగ్యమే ముఖ్యమన్న రామ్‌చరణ్‌.. విషయం ఏంటంటే?

ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వార్తలు చాలా వేగంగా వైరల్‌ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోలు, స్టార్‌ హీరోయిన్లకు సంబంధించిన విషయాలు మెరుపు వేగంతో దూసుకుపోతాయి. అందులో నిజానిజాలు ఏమిటి అనేది పక్కన పెడితే సోషల్‌ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే.. ఒక కంపెనీ చరణ్‌కి 15 కోట్లు ఆఫర్‌ చేస్తే దాన్ని రిజెక్ట్‌ చేశాడట. అదీ ఇప్పుడు వైరల్‌ అవుతున్న న్యూస్‌.

వివరాల్లోకి వెళితే... సాధారణంగా హీరోలు, హీరోయిన్లు పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేస్తుంటారు. దాని కోసం కోట్లలో పారితోషికం అందుకుంటారు. అయితే తమ కెరీర్‌లో ఒక్క యాడ్‌ కూడా చెయ్యని హీరోలు కూడా ఉన్నారు. చరణ్‌ కొన్ని బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు ఒక ప్రొడక్ట్‌ను ప్రమోట్‌ చేసేందుకు 15 కోట్లు ఆఫర్‌ ఇచ్చిందట ఆ సంస్థ. కానీ, దాన్ని చేసేందుకు చరణ్‌ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అది చిన్న పిల్లల ఫుడ్‌కి సంబంధించిన యాడ్‌. అందులో హానికరమైన కెమికల్స్‌ ఉంటాయని తెలుసుకున్న చరణ్‌ ఆ యాడ్‌ చేసేందుకు అంగీకరించలేదు. పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టే అలాంటి ప్రొడక్ట్స్‌ను తాను ప్రమోట్‌ చెయ్యనని చెప్పారట.

ఇది అఫీషియల్‌గా వచ్చిన వార్త కాదు. సోషల్‌ మీడియాలో ఇది సర్క్యులేట్‌ అవుతోంది. అది నిజమా, కాదా అనేది పక్కన పెడితే నెటిజన్ల నుంచి మాత్రం ఈ అంశంపై మంచి స్పందన వస్తోంది. పనిలోపనిగా చరణ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చరణ్‌ గొప్పతనాన్ని మెచ్చుకుంటూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. అలాగే ఈ న్యూస్‌ను షేర్‌ చేస్తూ మరింత వైరల్‌ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.