English | Telugu

టాలీవుడ్ స్టార్ లతో రామానాయుడు చిత్రాలు

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. దశాబ్దాలుగా ఆయన సినిమా రంగానికి చేసిన సేవను సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. యన్టీఆర్ తో 'రాముడు-భీముడు, స్త్రీజన్మ, శ్రీకృష్ణతులాభారం' చిత్రాలను నిర్మించిన రామానాయుడు, అక్కినేనితో 'సిపాయిచిన్నయ్య, ప్రేమనగర్, సెక్రటరీ, చిలిపికృష్ణుడు, ప్రేమమందిరం' వంటి సినిమాలను తెరకెక్కించారు.. కృష్ణతో 'బొమ్మలుచెప్పిన కథ, సావాసగాళ్ళు' తీసిన నాయుడు శోభన్ బాబుతో "జీవనతరంగాలు, సోగ్గాడు, చక్రవాకం, ఎంకి-నాయుడుబావ, కక్ష, దేవత"వంటి చిత్రాలను నిర్మించారు... శోభన్ బాబు-కృష్ణతో నాయుడు నిర్మించిన "మండేగుండెలు, ముందడుగు" చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి... చిరంజీవితో 'సంఘర్షణ', బాలకృష్ణతో "కథానాయకుడు, రాము", నాగార్జునతో 'చినబాబు' చిత్రాలను రూపొందించారు... తన తనయుడు వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ 'కలియుగపాండవులు' నిర్మించి విజయం సాధించారు... తరువాత వెంకటేశ్ హీరోగా "బ్రహ్మపుత్రుడు, ప్రేమ, బొబ్బిలిరాజా, కూలీ నంబర్ వన్, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ధర్మచక్రం, గణేశ్" వంటి చిత్రాలను నిర్మించారాయన ... టాప్ హీరోస్ తోనే కాదు ఇతర కథానాయకులతోనూ పలు చిత్రాలు నిర్మించారు నాయుడు... తన చిత్రాల్లో అడపా దడపా నటించి కూడా రామానాయుడు ఆనందించారు... ఒకప్పుడు నటుడు కావాలని కలలు కన్న రామానాయుడు తనయుడు వెంకటేశ్ హీరోగా సాధించిన విజయాలను చూసి పొంగిపోయారు.


తొలి చిత్రం 'రాముడు-భీముడు' మొదలు మొన్నటి 'దృశ్యం' దాకా రామానాయుడు చిత్రనిర్మాణంలో శ్రమించారు ... ఆయన సమర్పణలో చివరగా తెరకెక్కిన చిత్రం 'గోపాల గోపాల'... నిర్మాతగా తనదైన బాణీ పలికించిన రామానాయుడు తన తనయుడు సురేశ్ బాబుతోనూ కొన్ని సార్లు పోటీపడి సినిమాలు తీశారు... ఆయన ముందే ఎంతోమంది నిర్మాతలు వచ్చి మెరుపులు మెరిపించి వెళ్ళారు... అయినా రామానాయుడు మాత్రం నిర్మాతగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం! ఆయన నిర్మించిన శతాధిక చిత్రాల్లోఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి... వాటిలోని పాటలు,మాటలు,కథ,కథనం ఈ నాటికీ జనాన్ని ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం.... రామానాయుడు తన చిత్రాల ద్వారా జనం మదిలో సుస్థిరస్థానం సంపాదించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.