English | Telugu

వర్మ టీనేజ్‌లో ఇలా ఉండే వాడు..

రామ్ గోపాల్ వర్మ..ఈ పేరు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..వివాదాలకు బ్రాండ్. తన టేకింగ్ స్టైల్‌తో భారతీయ సినిమాను మలుపు తిప్పిన క్రియేటర్. డిటెక్షన్ సినిమా తీసినా, మాఫియాపై మూవీ తీసినా , హార్రర్, రోమాన్స్ ఇలా ఏది చేసినా ఆయనకే చెల్లింది. వర్మ టాలెంట్‌కు ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ క్యూ కట్టాయి. కాంట్రవర్సీలతో పబ్లిసిటీ చేసి సినిమాను హిట్ చేసే ఫార్మూలాకు పితామహుడు ఆర్‌జీవీ. నిత్యం ఏదో ఒక అంశంపై..ఎవరో ఒక వ్యక్తిపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తారు వర్మ. ప్రస్తుతం విజయవాడకు చెందిన వంగవీటి మోహన రంగా జీవిత కథతో వంగవీటి తీస్తున్నారు. దర్శకుణ్ని హీరోని చేసిన ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. వర్మ వీరాభిమాని ఒకరు ఆయన బర్త్‌డే కానుకగా అలాంటి వారి కోసం ఆయన చిన్పప్పటి నుంచి దర్శకుడయ్యే వరకు తీయించుకున్న కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అవి మీ కోసం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.