English | Telugu

చెర్రీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

ఆడియన్స్ తెలివికి పరీక్ష పెట్టే అతి కొద్దిమంది డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత, సుక్కు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఇన్నాళ్లూ చెర్రీ యాక్షన్ అండ్ మాస్ సినిమాలు, లవ్ సినిమాలు చేశాడు తప్ప వేరే జానర్ల వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ సుక్కుతో చేయబోయే సినిమా మాత్రం సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ కున్న మార్కెట్ వాల్యూ దాటి మరీ 70 కోట్ల భారీ ఖర్చుతో ఈ సినిమాను సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. తెలుగు హిందీ భాషల్లో సినిమా రిలీజయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ఇప్పటి వరకూ చేయని కొత్త జానర్లో రామ్ చరణ్ చేస్తున్నాడంటే, మెగాఫ్యాన్స్ కు కూడా పండగే. ప్రస్తుతం చెర్రీ తనీ ఒరువన్ రీమేక్ లో బిజీగా ఉన్నాడు. లెక్కల మాష్టారు సుక్కు, స్క్రిప్ట్ ను పక్కాగా బౌండ్ చేస్తున్నాడట. ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరమే..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.