English | Telugu

బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతోంది తనీ ఒరువన్ రీమేక్. ఈ మధ్యే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ షూట్ చాలా సైలెంట్ గా జరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో షెడ్యూల్ జరుపుకున్న మూవీ టీం, ఈ నెల 20 నుంచి బ్యాంకాక్ లో ఒక చిన్న షెడ్యూల్ ప్లాన్ చేశారు. అది పూర్తవ్వగానే, హైదరాబాద్ లో షూటింగ్ కంటిన్యూ అవనుంది. 28 న తన చిన్నక్క శ్రీజ పెళ్లి ఉండటంతో, ఆ టైం లోపే బ్యాంకాక్ షూట్ ముగిసిపోయేలా ప్లాన్ చేశాడు చరణ్. తనీ ఒరువన్ లో బ్యాంకాక్ లో జరిగేంత పెద్ద పెద్ద సీన్లేమీ లేవు. కేవలం సాంగ్ షూట్ కోసమే టీం అక్కడికి వెళ్తున్నారని సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ రీమేక్ కు ధృవ అనేది టైటిల్ గా వినిపిస్తోంది. అంతకు ముందు రక్షక్ అన్న టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. కాగా తమిళ్ లో విలన్ గా చేసిన అరవింద్ స్వామి తెలుగులో తన పాత్రను తిరిగి పోషించబోతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.