English | Telugu

కర్ణాటక సీఎంని కలిసిన రామ్ చరణ్..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే సినిమా చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ షూటింగ్ కర్ణాటకలోని మైసూర్ లో జరుగుతోంది. చిత్ర షూటింగ్ కోసం కర్ణాటక వెళ్ళిన చరణ్.. అక్కడ సీఎం సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు.

"పెద్ది సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఈరోజు మైసూర్‌లో నన్ను కలిసి కాసేపు మాట్లాడారు." అంటూ సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

'పెద్ది' షూటింగ్ కోసం ఇటీవల మైసూర్ వెళ్ళిన చరణ్.. తన అమ్మమ్మ, అల్లు కనకరత్నమ్మ మరణ వార్త తెలిసి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. ఈరోజు మళ్ళీ ఆయన మైసూర్ వెళ్ళారు.

వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026, మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .