English | Telugu

చ‌ర‌ణ్‌తో ఫైట్ చేయ‌బోతోన్న రకుల్‌

రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఓ రేంజులో ఉందిప్పుడు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, రామ్‌.. వీళ్లంతా `మాకు ర‌కులే కావాలి..` అంటున్నారు. చేతి నిండా సినిమాలే! ఈ క్రేజ్‌ని ఇలానే ప‌ది కాలాల పాటు కాపాడుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తోందీ భామ‌. ర‌కుల్‌ ఎలాగూ గ్లామ‌ర్ డాలే. ఆ అందాల్ని మ‌రింత‌గా సాన‌బెడుతోందిప్పుడు. స‌న్న‌గా రివ‌ట‌లా ఉండే ర‌కుల్ ఇప్పుడు జిమ్‌లో దూరి క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఎందుకంటూ ఆరా తీస్తే.. ర‌కుల్ త్వ‌ర‌లో ఫైటింగులు చేయ‌బోతోంద‌ని తేలింది. ఔను.. ర‌కుల్ డిష్యూం డిష్యూం అంటూ ఫైటింగులు చేస్తుంద‌ట‌. రామ్ చ‌రణ్ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందులో ర‌కుల్ క‌థానాయిక‌. ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఫైట్ మాస్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ర‌కుల్‌దీ అలాంటి ర‌ఫ్ అండ్ ట‌ఫ్ పాత్రేన‌ట‌. అందుకే జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తోందిప్పుడు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్ ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అంటే.. ర‌కుల్‌, చర‌ణ్ ఇద్ద‌రూ డిష్యూం డిష్యూం అన్న‌మాట‌.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.