English | Telugu

రజనీకాంత్ ను పొగిడేస్తున్న బాలయ్య హీరోయిన్..!

బాలయ్య సరసన లెజండ్ సినిమాలో నటించిన రాధికా ఆప్టే, బాలీవుడ్ లో కథా నేపథ్యమున్న చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. అవి కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలీలో నటించే అవకాశం కూడా రాధికను వరించింది. ఆయనతో కలిసి వయసైపోయిన పాత్రలో నటించిన రాధికా, రజనీని పొగిడేస్తోంది. రజనీతో కలిసి నటించిన ప్రతీ హీరోయిన్ చెప్పే మాటలే అయినా, అదే రజనీ స్పెషాలిటీ అంటోంది. ఆయనకు సాటెవరూ లేరని, ఆయనతో షూటింగ్ లో పాల్గొన్న రోజులు తన జీవితంలో చాలా విలువైనవనీ, తోటి నటీనటులకు ఆయన స్ఫూర్తి అంటూ రజనీని ఆకాశానికెత్తేస్తోంది. కబాలీలో ఏజ్ అయిపోయిన గ్యాంగ్ స్టర్ గా రజినీ నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తాజా బాలీవుడ్ సినిమా ఫోబియా ట్రైలర్ ఆవిష్కరణ సమయంలో ఒక విలేకరి కబాలీలో వర్కింగ్ గురించి అడిగినప్పుడు ఇదంతా చెప్పుకొచ్చింది. రాధికా ఆప్టే లీడ్ రోల్ చేసిన ఫోబియా కూడా మంచి కథాంశంతో రూపొందుతోంది. కబాలీ తర్వాత తనకు మరిన్ని మంచి అవకాశాలొస్తాయని ఆశిస్తోందీ భామ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.