English | Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కోర్టు సమన్లు

సూపర్ స్టార్ రజనీకాంత్ కు మదురై కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో ఆయన హీరోగా కె.యస్.రవికుమార్ తీసిన లింగా సినిమా కథ తనదే నంటూ రవిరత్నం అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో పాటు హీరో రజనీకాంత్ కు కూడా మదురై కోర్టు సమన్లు పంపింది. మద్రాస్ హైకోర్టు లో విచారణకు సమయం పడుతున్నందున, కేసును మదురై కోర్టుకు ట్రాన్స్ ఫర్ చేయాలన్న రవిరత్నం కోరికను హైకోర్టు మన్నించింది. తన కథను అనుమతి లేకుండా వాడుకున్నందుకు తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును రవిరత్నం పిటిషన్లో పేర్కొన్నాడు. మరి లింగా వివాదం ఆయన్ను ఎప్పుడు వదులుతుందో చూడాలి. ప్రస్తుతం కబాలీ షూటింగ్ లో రజినీ బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఆయన చిరంజీవి 150వ సినిమాలో కాసేపు కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కబాలీ తర్వాత, రోబో 2 రజనీ కోసం రెడీగా ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.