English | Telugu

రాజమౌళి సామ్రాట్ అశోక తీస్తున్నాడా..?

ఇప్పుడున్న తెలుగు దర్శకుల్లో అగ్రస్థానం ఎవరిది అంటే, డౌట్ లేకుండా రాజమౌళిదే అని చెబుతారు ఎవరైనా. సినిమా జానర్ ఏదైనా అద్భుతంగా తెరకెక్కించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. బాహుబలి తర్వాత ఆయన ఖ్యాతి దేశవ్యాప్తమైంది. ఈగతోనే మంచి దర్శకుడని బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న రాజమౌళి ఫేమ్ ను బాహుబలి మరింత బలపరిచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ భాషలోనైనా, ఏ హీరోతోనైనా సినిమా చేయగల దమ్ము రాజమౌళికి ఉంది. ప్రస్తుతం ఒక ఊహాజనిత చారిత్రకంగా బాహుబలిని తీస్తున్న రాజమౌళికి త్వరలోనే అద్భుతమైన చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే రుద్రమదేవి కథతో గుణశేఖర్, శాతకర్ణి కథతో క్రిష్ సినిమాలు బుక్ చేసేసుకున్నారు. ఈ రెండూ తెలుగువారికి సుపరిచితమైన కథలు. రాజమౌళి మాత్రం, జాతీయ స్థాయిలో సామ్రాట్ అశోక సినిమాను డైరెక్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మంగళవారం నేషనల్ అవార్డ్ తీసుకున్న తర్వాత మీడియాతో ముచ్చటించిన రాజమౌళి, తన మనసులోని కోరికను బయటపెట్టాడు. సామ్రాట్ అశోక లేదా మహారాణా ప్రతాప్ సినిమాల్ని దేశవ్యాప్తంగా ఆదరణ లభించే విధంగా తెరకెక్కించాలని ఉందంటున్నాడు దర్శక జక్కన్న. బాహుబలి 2 పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో జక్కన్న సినిమా ఉంటుంది. ఆ తర్వాతి ప్రాజెక్టే అశోకుడి మీద తెరకెక్కినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.