English | Telugu

రాజా సాబ్ కి పోటీగా ధురంధర్.. షాక్ తప్పదా..!

ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా చేసుకొని విడుదలవుతాయి అనడంలో సందేహం లేదు. ప్రభాస్ నుంచి రానున్న నెక్స్ట్ మూవీ 'ది రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాన్ ఇండియా వైడ్ గా 'రాజా సాబ్' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అదే రోజు ఓ భారీ బాలీవుడ్ ఫిల్మ్ విడుదలవుతోంది. దీంతో నార్త్ లో 'రాజా సాబ్' వసూళ్లపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రణవీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ధురంధర్'. 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌' తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. పైగా ఇందులో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాంతో హిందీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ టీజర్ ను వదిలారు. ఈ టీజర్ యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఉంది. కొంతకాలంగా హిందీ మార్కెట్ లో యాక్షన్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సౌత్ నుంచి వెళ్ళిన 'కేజీఎఫ్-2', 'పుష్ప-2' వంటి సినిమాలు సైతం అక్కడ సంచలన వసూళ్ళు సాధించాయి. అలాంటిది బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'ను వారు ఓన్ చేసుకోవడంలో ఆశ్చర్యంలేదు. అదే జరిగితే 'రాజా సాబ్' హిందీ వసూళ్లపై ప్రభావం పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. తన స్టార్డంతో హిందీ మార్కెట్ లో హిందీ సినిమాకే షాకిచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. చూద్దాం మరి 'రాజా సాబ్' ఏం చేస్తాడో.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.