English | Telugu

భారీ బడ్జెట్ తో తమ్ముడు.. దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా..?

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ ఎక్కువసార్లు కరెక్ట్ అవుతుంటుంది. ఒక సినిమా పట్టాలెక్కించే ముందు ఆయన ఎన్నో లెక్కలేసుకుంటారు. అలాంటి దిల్ రాజు.. ప్రజెంట్ హీరో నితిన్ మార్కెట్ కి మించి 'తమ్ముడు' సినిమా కోసం ఖర్చు చేశారు. దీంతో దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు దిల్ రాజు. (Dil Raju)

"ప్రేక్షకులకు థియేటర్లలో ఓ మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తమ్ముడు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశాము. బడ్జెట్ రూ.75 కోట్ల దాకా అవుతుంది. అయితే హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడంతో రూ.67 కోట్లలో సినిమాని పూర్తి చేయగలిగాం. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.35 కోట్లు వచ్చాయి. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.32 కోట్లు వస్తే సరిపోతుంది. తమ్ముడు సినిమా కొత్తగా ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది." అన్నారు.

దిల్ రాజు నిర్మించే సినిమాలు ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటాయి. అలాంటిది తమ్ముడుకి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ రావడంపై కూడా దిల్ రాజు స్పందించారు. "ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసే విధానం మారిపోయింది. అయితే ఎంటర్టైనర్ తీయాలి.. లేదంటే థియేటర్లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అందించాలి. తమ్ముడు అలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. సెకండాఫ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే సెన్సార్ A ఇచ్చింది. ఆ సన్నివేశాలను తగ్గిస్తే U/A ఇస్తామన్నారు. కానీ, ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము A తీసుకున్నాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఎక్కువ శాతం ఫారెస్ట్ లో ఉంటుంది. ఒక మంచి అడ్వెంచర్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది." అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Interview link:Dil Raju Exclusive Interview

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.