English | Telugu

సలార్ స్టోరీ ఇదే.. ఫ్యాన్స్ కి షాకిచ్చిన ప్రశాంత్ నీల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్‌ఫైర్‌ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా కాదా? కేజీఎఫ్ కథతో లింక్ ఉంటుందా లేదా? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా వాటన్నంటికీ సమాధానం దొరికింది.

సలార్ కథ ఎలా ఉండబోతుంది? 'కేజీఎఫ్' స్టోరీతో లింక్ ఉంటుందా? అనే విషయాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. "బద్ద శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథ సలార్. ఇందులో స్నేహం అనేది ప్రధాన భావోద్వేగం. ఈ ఇద్దరు స్నేహితుల ప్రయాణాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. అలాగే కేజీఎఫ్, సలార్ రెండూ భిన్నమైన కథలు. ప్రేక్షకులు సలార్ నుండి మరొక కేజీఎఫ్ ని ఆశించకూడదు. సలార్ దాని స్వంత ప్రపంచం, దాని స్వంత భావోద్వేగాలు, పాత్రలు కలిగి ఉంటుంది." అని నీల్ చెప్పారు. ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే శత్రువులుగా మారిన స్నేహితులు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ అని అర్థమవుతోంది.

మొత్తానికి కేజీఎఫ్ కథతో సలార్ కి సంబంధం లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న సినిమా అని సలార్ పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరాశ కలిగించే విషయమని చెప్పవచ్చు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.