English | Telugu

' పోలీసోడు ' రిలీజ్ ఒకరోజు పోస్ట్ పోన్..!

తమిళ ఇళయదళపతి విజయ్ నటించిన పోలీస్ జానర్ మూవీ తేరీ. తెలుగులో పోలీసోడు గా దిల్ రాజు తీసుకొస్తున్నారు. విజయ్ కు సూర్య, కార్తి, విక్రమ్ లాంటి వాళ్లతో పోలిస్తే, తెలుగులో ఇంకా పెద్ద మార్కెట్ క్రియేట్ అవలేదు. వాళ్లందరూ ఇక్కడ స్టార్స్ అయిపోయినా, విజయ్ మాత్రం ఇంకా ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తుపాకీ, అన్న లాంటి సినిమాలు ఫర్వాలేదనిపించినా, విజయ్ కు పూర్తి తెలుగు గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఈ వారం రాబోతున్న తన పోలీసోడు సినిమా మీదే ఇప్పుడు విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఏప్రిల్ 14 న రిలీజ్ అవుతుందని ప్రకటించిన దిల్ రాజు ఇప్పుడు తెలుగు రిలీజ్ డేట్ లో చిన్న మార్పు చేశారు. తమిళంలో 14 నే వస్తున్నా, తెలుగులో మాత్రం ఏప్రిల్ 15 న రిలీజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో తమిళంలో తేరీ రిలీజైన ఒకరోజు తర్వాత తెలుగులో పోలీసోడు రిలీజ్ కానుంది. తమిళ్ లో వచ్చిన టాక్ తెలుగులో కూడా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తుందడంలో మాత్రం సందేహం లేదు. రాజారాణి ఫేం అట్లీ తెరకెక్కించిన పోలీసోడులో సమంత, అమీ జాక్సన్లు హీరోయిన్లుగా నటించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.