English | Telugu

నాగార్జున ఫ్యామిలీ హీరో తల్లిపై పోలీస్‌ కేసు!

అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో నాగచైతన్య, అఖిల్‌ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సుమంత్‌, సుశాంత్‌ కూడా గతంలో కొన్ని సినిమాల్లో హీరోలుగా నటించారు. వీరిలో సుశాంత్‌.. నాగార్జున చెల్లెలు ఎ.నాగసుశీల తనయుడు. కొడుకుని హీరోగా పెట్టి ‘కాళిదాసు’, ‘కరెంట్‌’, ‘అడ్డా’, ‘ఆటాడుకుందాం రా’ వంటి సినిమాలను చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి నిర్మించారు. ఆ సినిమాలు కమర్షియల్‌గా అంత సక్సెస్‌ అవ్వలేదు. ఆ తర్వాత చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల కలిసి కొంతకాలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే చింతలపూడిపై కేసు పెట్టింది నాగసుశీల. తనకు తెలియకుండా భూముల్ని అమ్ముకున్నాడని ఆమె కేసు పెట్టింది.
తాజాగా మరోసారి నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కేసు పెట్టడం చింతలపూడి శ్రీనివాసరావు వంతు అయింది. నాగసుశీలతోపాటు 12 మంది కలిసి తనపై దాడి చేశారని మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు చింతలపూడి. ఎప్పటి నుంచో లావాదేవీల విషయంలో వీరిమధ్య గొడవలు ఉన్నాయి. అవి పెరిగి ఇప్పుడు పోలీస్‌ కేసు వరకు వెళ్ళాయి. ఇది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.