English | Telugu

పవర్ స్టార్ తో బాలయ్య డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయాలు చాలా సడెన్ గా, విచిత్రంగా ఉంటాయి. రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్న ఆయన, త్వరలోనే ఇంకో డైరెక్టర్ తో సినిమాకు ఒప్పుకున్నారు. ఆ డైరెక్టర్ బాలకృష్ణతో లయన్ సినిమా తీసిన సత్యదేవా. కేవలం ఒకే ఒక్క సినిమా చేసి అది కూడా బిల్ యావరేజ్ గా ఆడిన డైరెక్టర్ కు పవన్ ఛాన్స్ ఇచ్చారేంటబ్బా అని ఆయన ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా దాసరి నారాయణరావు వ్యవహరించనున్నారని సమాచారం.

గతంలోనే దాసరి తన నిర్మాణంలో, పవన్ సినిమా ఉంటుందని ప్రకటించారు. దాంతో సత్యదేవా తన కథతో దాసరిని మెప్పించారని, ఇద్దరూ ఇప్పుడు పవన్ కు కథ వినిపించడానికి ఎదురుచూస్తున్నారని అంటున్నారు. పవన్ సినిమాతో పాటు, బాలయ్య వందో సినిమాను కూడా తానే డైరెక్ట్ చేస్తానని ప్రకటించాడు సత్యదేవా. కానీ పవన్ తో సినిమా అంటే, అది పట్టాలెక్కేవరకూ ఓకే కానట్టే. గతంలో సంపత్ నందికి సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి, దాన్ని మళ్లీ రవీంద్ర(బాబీ) కి ట్రాన్స్ ఫర్ చేశారు పవన్. మరిప్పుడు సత్యదేవాతో పవన్ సినిమా ట్రాక్ ఎక్కే అవకాశం ఎంత వరకూ ఉంటుందో చూడాలి..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.