English | Telugu

పవన్ కళ్యాణ్ తొలిప్రేమకు 17 సంవత్సరాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు అంటేనే అభిమానులకు యమ క్రేజ్. సినీ రంగంలోనే స్టైల్ తో ఒక ట్రేండ్ ని సృష్టించాడు. తన మాటలు, చేతలు, నడక అన్నీ వైవిధ్యంగా ఉండటంతో చిత్రరంగంలో అందరికంటే ఎక్కువ అభిమానులను సొంతం చేసుకున్నాడు. మెగస్టార్ తమ్ముడిగా సినీ రంగుల లోకంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అన్న పేరు అంతగా ఉపయోగించుకోకుండానే.. తక్కువ కాలంలోనే తనకంటూ ఒక సెపరేట్ ట్రాక్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అంతమంది అభిమానులను సంపాదించుకున్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ కే సాధ్యమయింది. అలా ఆయన నటించిన సినిమాల్లో ఆయన కెరీర్ లోనే పెద్ద మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం తొలిప్రేమ. ఈ చిత్రం వచ్చి ఇప్పటికీ 17 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.


ఈ చిత్రం అప్పటి జనరేషనే కే కాదు ఇప్పటి జనరేషన్ కూడా ఎంతో ఇష్టపడే సినిమా. ఎన్నో ప్రేమ సినిమాలు వచ్చినా కొన్ని సినిమాలు మాత్రమే మన మనసులో చిరస్థాయిగా మిగిలిపోతాయి అలాంటి సినిమాల్లో తొలిప్రేమ కూడా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రెండువందల రోజులకు పైగానే ఆడి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి పవన్ కళ్యాణ్ కు స్టార్ స్టేటస్ ను తీసుకొచ్చింది. మరి ఇలాంటి సినిమాలు ఇంకా పవన్ కళ్యాణ్ తీయాలని ఎన్నో కోరుకుంటూ.. తొలిప్రేమ సినిమా 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అభినందనలు చెబుదాం..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.