English | Telugu

దేవర లో చంద్రుడు మీద రక్తం పడటం ఏంటంటున్నసందీప్ రెడ్డి.. రంగంలోకి ఎన్టీఆర్  

యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)సెప్టెంబర్ 27 న దేవర(devara)గా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు.రీసెంట్ గా ముంబై వేదికగా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా దేవర మీద పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర కొచ్చే కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగాన్ని కూడా పెంచింది. ఈ క్రమంలోనే యానిమల్ మూవీ తో ఇండియా వైడ్ గా గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి(sandeep reddy)దేవర ని ఇంటర్వ్యూ చేసాడు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఎన్టీఆర్ తో పాటు విలన్ గా చేసిన సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్, డైరెక్టర్ కొరటాల శివ(kortala siva)ని సందీప్ ఇంటర్వ్యూ చేసాడు.రిలీజ్ కి ముందు ప్రేక్షకులకి మరింత థ్రిల్ ని ఇవ్వడానికే ఆ ఇంటర్వ్యూ జరిగిందనే విషయం ప్రోమో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది. సందీప్ అడిగిన మాటలకి దేవర యాక్షన్ యాక్షన్ డ్రామా అని ఎన్టీఆర్ చెప్పడం,అలాగే ఒక ఫైటింగ్ సీన్ లో సగం మూన్ మీద రక్తం పడి రౌండ్ గా అవ్వడం ఎలా అని కొరటాలని సందీప్ అడిగితే అప్పుడే ఆన్సర్ చెప్పద్దని ఎన్టీఆర్ చెప్పటం చాలా క్యూరియాసిటీ ని కలుగచేస్తుంది. అదే విధంగా సందీప్ తో యానిమల్ మూవీ డ్యూరేషన్ మూడుగంటల పదిహేను నిమిషాలా అని ఎన్టీఆర్ అడగగానే మూడుగంటల ఇరవై నాలుగు నిమిషాలు అని సందీప్ చెప్పడం.ఆ తర్వాత ముప్పై ఐదు రోజులు వాటర్ కింద షూటింగ్ చేసాం. అది చాలా టఫ్ అని ఎన్టీఆర్ చెప్పడం ఇలా ప్రోమో ఆసాంతం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అదే విధంగా సైఫ్ అలీ ఖాన్ , జాన్వీ, కొరటాల శివ తో కూడా సందీప్ అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దీంతో పూర్తి ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరో రోజుల్లో పూర్తి ఇంటర్వ్యూ బయటకి రానుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.