English | Telugu

మాట‌ల మాంత్రికుడిని పట్టేసిన నితిన్

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్న దానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. స్టార్ కథానాయకులు బిజీ అయిపోవడంతో త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ దానిలో కూడా నిజం లేదని తేలిపోయింది.లేటెస్ట్ గా త్రివిక్రమ్ ఓ చిన్న హీరోతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట.

ఈ విషయం తెలుసుకున్న హీరో నితిన్..మాటల మంత్రికుడి వద్ద చాన్స్ కొట్టేయాలని డిసైడ్ అయ్యాడట. వెంటనే తన దేవుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తన కోరికను వెళ్ళబుచ్చాడట. దీంతో ఆయన తన స్నేహితుడు అయిన త్రివిక్రమ్ కు నితిన్ తో ఓ సినిమా చేయమని సూచించడట.

ప్రస్తుతం నితిన్ కూడా మంచి సక్సెస్ ట్రాక్ లో వుండడం, మనోడికి మాస్ లో కూడా ఎక్కువ ఫాలోయింగ్ వుండడంతో త్రివిక్రమ్ ఓకే చెప్పినట్టు సమాచారం. దాంతో మాట‌ల మాంత్రికుడు నితిన్ కోసం ఓ కథ తయారు చేస్తున్నాడట. త్వరలో సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళుతు౦దట. ఎలాగైతేనే౦ పెద్ద హీరోలకే దొరకని మాట‌ల మాంత్రికుడిని నితిన్ పట్టేసాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.