English | Telugu
మరోసారి చిక్కుల్లో పడ్డ త్రిష... ఇప్పుడేమన్నారు?
Updated : Jan 9, 2023
ఈ మధ్య త్రిష చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నప్పటికీ, పొన్నియన్సెల్వన్ సినిమా ప్రమోషన్ టైమ్లో చాలా మంది కొత్త త్రిషను చూశారు. పెళ్లెప్పుడు? అని అడిగినవాళ్లకు కూడా అసలు అలా ఎందుకు అడుగుతారు? అదేదో అప్పిచ్చినట్టు అడుగుతున్నారు? పెళ్లి చేసుకోకపోవడం నేరమా? అంటూ ఓపెన్గా కసురుకున్నారు.ఆ మాటలన్నిటినీ సైలెంట్గా అబ్జర్వ్ చేసిన నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. త్రిష నటించిన రాంగీ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది త్రిషకు. చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ రిలీజ్ కావడం, మంచి పేరు తెచ్చుకోవడంతో త్రిష కూడా యాక్టివ్గా ప్రమోషన్ చేస్తున్నారు.
ఈ ప్రమోషన్లలో భాగంగా త్రిషకు ఓ ప్రశ్న ఎదురైంది. మీకు నచ్చిన భోజనం ఏంటి? అని. అందుకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు త్రిష. ``దక్షిణాదిన చేసే బ్రాహ్మిణ్ హోమ్ ఫుడ్ ఏదైనా నాకు అత్యంత ప్రీతికరం`` అని అన్నారు. అసలు భోజనానికి కులానికీ సంబంధం ఏంటి? అలా ఎందుకు కులం పేరు ప్రస్తావించాల్సి వచ్చిందని ఫైర్ అవుతున్నారు కొందరు. అయినా తనకు నచ్చింది తను చెప్పింది, ఇందులో మనం హర్ట్ అవ్వాల్సిన పనేంటని వెనకేసుకుని వస్తున్నారు మరికొందరు. సోషల్ మీడియా పెరిగిన ఈ టైమ్లో ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలని త్రిషకు సలహాలు ఇస్తున్నారట సన్నిహితులు.
ప్రస్తుతం త్రిష పొన్నియిన్సెల్వన్ పార్ట్ 2 పనుల్లో ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కుందవై కేరక్టర్ చేశారు త్రిష. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ సెకండ్ పార్ట్ పూర్తయ్యాక, మణిరత్నం దర్శకత్వంలోనే కమల్హాసన్ సరసన మరో సినిమా చేస్తారన్నది టాక్.
