English | Telugu

కాళీమాత ఆలయాలపై దాడి.. స్పందించిన నరేష్‌!

భారతదేశం అంటే సెక్యులర్‌ దేశం. ఇక్కడ అన్ని మతాలవారు ఉంటారు. అయితే ఎవరి నమ్మకాలు వారివి. ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడం, లేదా ఆ మతాల వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం అనేది ఎవరూ సహించలేరు. ముఖ్యంగా ఈమధ్యకాలంలో హిందూ మతాన్ని అవమానిస్తూ కొన్ని దారుణమైన ఘటనలు జరిగాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్‌, అంబర్‌పేట, నాంపల్లిలోని కాళీమాత ఆలయాలపై దాడులు జరిగాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మనం చూశాం. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం యువకుడికి స్థానికులు దేహశుద్ది చేశారు. ఆ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలియజేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు విచారించకుండానే, ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే పోలీసులు ఒక నిర్ణయానికి రావడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఇటువంటి దుశ్చర్యలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌ నటుడు నరేష్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ ఘటనపై, పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నరేష్‌ తన ట్వీట్‌లో ఏం పేర్కొన్నారంటే..

‘సికింద్రాబాద్‌, అంబర్‌పేట్‌, నాంపల్లిలోని కాళీమాత ఆలయాలపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. క్షుణ్ణంగా విచారించకుండానే నిందితుడు మానసిక వ్యాధిగ్రస్తుడనే నిర్ధారణకు అధికారులు వచ్చారు. సాంస్కృతిక ఉగ్రవాదాన్ని ఎందుకు కాపాడాలి. సెక్యులర్‌ అని పిలవబడే మన దేశంలో మనమందరం శాంతియుతంగా పూజిద్దాం. దీనికి పారదర్శక విచారణ, న్యాయం అవసరం’ అంటూ ట్వీట్‌ చేశారు నరేష్‌.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.