English | Telugu

నాని తర్వాతి సినిమా పేరు జెంటిల్ మన్..!

నాని ఫస్ట్ మూవీ అష్టా చమ్మాను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణతో ఇప్పుడో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు జెంటిల్ మన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు మూవీ టీం. దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇంద్రగంటి సినిమా అంటేనే రొటీన్ కు భిన్నంగా ఉంటాయనే పేరు తెచ్చుకున్నారు. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న జెంటిల్ మన్ కూడా చాలా డిఫరెంట్ జానర్ మూవీ అని సమాచారం. సినిమా ఎక్కువగా థ్రిల్లర్ జానర్లో సాగుతుందట. ఆదిత్య 369, వంశానికొక్కడు సినిమాలు తీసిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. జెంటిల్ మన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, రమాప్రభ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత మణిశర్మ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఇదే కావడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.