English | Telugu

నాని,రమ్యకృష్ణ కాంబోలో సినిమా!

'దసరా,హాయ్ నాన్న,సరిపోదాశనివారం వంటి వరుస హిట్లతో నాచురల్ స్టార్ నాని(nani)హ్యాట్రిక్ ని అందుకున్న విషయం తెలిసిందే.పైగా ఆ మూడు చిత్రాలు నాని కెరీర్లోనే ఒకదాన్ని మించి ఒకటి రికార్డు కలెక్షన్స్ ని సాధించాయి.దీంతో ఇప్పుడు నాని సినిమాల మీద ఆయన అభిమానుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హిట్ 3 మూవీని స్టార్ట్ చేసిన నాని 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(srikanth odela)తో 'ప్యారడైజ్'(paradise)అనే ఒక డిఫరెంట్ టైటిల్ తో కూడిన సినిమాని కూడా ప్రారంభించాడు.

ఇప్పుడు ఈ మూవీలో ఒకప్పటి అగ్ర హీరోయిన్ రమ్యకృష్ణ(ramyakrishna)నటించబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నాని తల్లి క్యారక్టర్ లో రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందని, అలాగే ఆ క్యారక్టర్ సినిమాకి హైలెట్ గా నిలబోతుందని కూడా అంటున్నారు. మరి ఈ విషయం మీద మేకర్స్ నుంచి అయితే ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

కాకపోతే ఈ వార్త సోషల్ మీడియాలో వస్తుండంతో నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నాని, రమ్యకృష్ణ లు కలిసి వర్క్ చేయాలనీ అనుకుంటున్నారు. పైగా నాని కెరీర్ లో ఇప్పటి వరకు అగ్ర హీరోయిన్ రేంజ్ ఉన్న నటి హీరోయిన్ గా చేసిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.ఎస్ ఎల్ వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.