English | Telugu

చరిత్ర తవ్వుతున్న బాలయ్య..!

తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. తెలుగు జాతి చరిత్రలో గుర్తుండిపోయేలా తన సినిమాను తెరకెక్కించడానికి బాలయ్య శ్రమపడుతున్నారు. చారిత్రక చిత్రం కావడం..క్రీశ ఒకటవ శతాబ్ధానికి సంబంధించిన చరిత్రను తవ్వుతున్నారు. ఈ మూవీ కోసం పరిశోధన, సమాచార సేకరణలో భాగంగా ఇటీవల బాలకృష్ణ, క్రిష్ కొంతమంది బౌద్ధగురువులతో చర్చించినట్టు సమాచారం. వారిని స్వయంగా తన ఇంటికి పిలిపించుకుని, దాదాపు 12 గంటల పాటు చర్చలు జరిపారట. గౌతమీపుత్ర శాతకర్ణి బౌద్ధాన్ని ఆదరించడం వల్ల వారి గ్రంథాల్లో ఆయన గురించి ప్రస్తావన ఉండవచ్చని బాలయ్య భావించారు అందుకే బౌద్ద గురువులను కలిశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.