English | Telugu

కొండా సురేఖపై పరువు నష్టం దావా.. పాపం నాగార్జునకు ఇలా జరిగిందేమిటి?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే జరుగుతోంది. రాజకీయ లబ్ది కోసం నాగార్జున కుటుంబాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖపై ప్రతి ఒక్కరూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండిరచారు. యావత్‌ సినీ పరిశ్రమ నాగార్జున కుటుంబాన్ని సపోర్ట్‌ చేస్తోంది. అంతేకాదు, ప్రతి ఒక్కరూ మంత్రి చేసిన పనిని తప్పుబడుతూ ట్వీట్లు పెడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని ఇటీవల మీడియా తెలియజేసింది. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగింది.

ఈ విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్న నాగార్జున... ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అయితే పరువు నష్టం కింద ఎలాంటి డబ్బు డిమాండ్‌ చెయ్యని నాగార్జున, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ వేశారు. శుక్రవారం ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలియజేసింది. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణను వాయిదా వేశారు. అక్టోబర్‌ 7న కేసును విచారిస్తామని న్యాయస్థానం తెలియజేసింది. నాగార్జున కుటుంబాన్ని అభాసుపాలు చేసేందుకు పూనుకున్న మంత్రి కొండా సురేఖపై అన్నివర్గాల ప్రజలు, ప్రముఖులు ఆగ్రహంతో ఉన్నారు. త్వరితగతిన ఈ కేసు విచారణ జరిగితే బాగుండేది అని భావిస్తున్నారు ప్రజలు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో, కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.