English | Telugu

నాగచైతన్య పోలీస్ లుక్ లీకయ్యింది..!

గౌతమ్ మీనన్ డైరెక్షన్లో నాగచైతన్య చేస్తున్న సినిమా సాహసం శ్వాసగా సాగిపో. ఇప్పటి వరకూ ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా లీకైన స్టిల్ బట్టి, మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. పోలీస్ లుక్ లో నాగచైతన్య నడిచి వస్తున్న స్టిల్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వైరల్ అవుతోంది. చైతూ లుక్స్ కు ఫుల్ మార్క్ వేస్తున్నారు సినీజనాలు. యాక్షన్ సినిమాలు తీయడంలో గౌతమ్ మీనన్ ది ప్రత్యేకమైన శైలి. ఆయన తీసిన ఘర్షణ, ఎంతవాడుగానీ లాంటి సినిమాలే అందుకే కరెక్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు యువ హీరోను పోలీస్ గా ఎలా చూపిస్తాడోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. రొమాంటిక్ హీరోగానే తప్ప, ఇప్పటివరకూ పూర్తి స్థాయి మాస్ హీరోగా ప్రూవ్ చేసుకునేంత సక్సెస్ చైతూకు రాలేదు. ఈ సినిమాతో, మాస్ జనాల్లో కూడా తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడీ అక్కినేని హీరో. సాహసం శ్వాసగా సాగిపో ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. మళయాళ భామ మంజిమా మోహన్ చైతూ సరసన నటిస్తోంది. సినిమా ఫస్టాఫ్ రొమాంటిక్ గా, సెకండాఫ్ అంతా యాక్షన్ తో ఉంటుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. లీక్డ్ లుక్ లో చైతూ మీసకట్టు శాతకర్ణిలో బాలయ్య మీసానికి దగ్గరగా ఉండటం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.