English | Telugu

తెరపైకి వీర జవాన్ మురళి నాయక్ జీవిత కథ.. తండా ప్రజల హర్షం  

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల జీవిత కథలని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కోవలోనే గత ఏడాది 'మేజర్ ముకుంద్ వరదరాజన్'(Major Mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'అమరన్'(Amaran)వచ్చి ప్రతి ఒక్క భారతీయుడిలో దేశభక్తిని మెండుగా నింపింది. దేశం కోసం తల్లితండ్రులని, భార్యా బిడ్డలని వదిలేసి,పోరాడిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి కూడా పెట్టించింది.

ఈ కోవలోనే 'మే' 9 న పాకిస్థాన్ కి చెందిన తీవ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన 'మురళి నాయక్'(Murali Nayak)జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతుంది. టైటిల్ రోల్ ని 'సోలో బాయ్' మూవీ ఫేమ్ గౌతమ్ కృష్ణ(Gautham Krishna)పోషిస్తున్నాడు. ఈ మేరకు మేకర్స్ అధికారంగా తెలపడంతో పాటు, అందుకు సంబంధించి రిలీజ్ చేసిన 'పోస్టర్' బయోపిక్ ఏ స్థాయిలో రూపుదిద్దుకోబోతుందో చెప్తుంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై కె.సురేష్ బాబు(K. Suresh Babu)పాన్, ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్‌లోని 'పహల్ గామ్'(Pahal Gam)దగ్గర పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు సుమారు 22 మందిని అత్యంత పాశవికంగా హత మార్చారు. ఇందుకు ప్రతిగా మన సైన్యం 'ఆపరేషన్ సిందూర్'(Operation sindoor)ని నిర్వచించి తీవ్రవాదులని మట్టుబెట్టడం జరిగింది. ఈ సంఘటనతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో మహారాష్ట్రలోని 'నాసిక్' వద్ద విధులు నిర్వహిస్తున్న మురళి నాయక్ ని అధికారులు జమ్మూ కాశ్మీర్ కి పిలిపించారు. అక్కడి చేరుకున్న మురళి నాయక్ పాకిస్థాన్ తీవ్రవాదులని కొంత మందిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత కాల్పుల్లో వీరమరణం పొందాడు. మురళి నాయక్ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లి తండా. మురళి నాయక్ జీవిత కథ సినిమాగా రావడం పట్ల తండా వాసులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.