English | Telugu

ధోనీ కథకు ముగింపు ఎలా ఇద్దాం..?

బాలీవుడ్ లో బయోపిక్ లు కనకవర్షం కురిపిస్తున్నాయి. లేటెస్ట్ గా సంచలనాలు సృష్టిస్తున్న నీర్జా యే అందుకు ఉదాహరణ. బయోపిక్స్ ఎఫెక్ట్ తోనే సల్మాన్ సుల్తాన్, అమీర్ దంగల్ బయోపిక్స్ తీస్తున్నారు. స్పోర్ట్స్ పర్సనాలిటీలైన, అజార్, సింధు, సానియా, పుల్లెల గోపీచంద్ లాంటి వారిపై కూడా సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటన్నిటి మధ్యలోనూ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటూ వెళ్తోంది ధోనీ బయోపిక్. జీవిత చరిత్రతో సినిమా అంటే మాటలు కాదు. అందులోనూ ధోనీ లాంటి సెలబ్రిటీకైతే, ప్రతీ సీన్ నూ, అతని జీవితంతో పోల్చి చూస్తారు. అందుకే దర్శకుడు నీరజ్ పాండే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కాకపోతే ఇప్పుడు మూవీ టీం కి వచ్చిన పెద్ద సమస్య, సినిమాని ఎక్కడ ముగించాలి అని. ధోని టెస్టుల నుంచి రిటైరయ్యాడు. వన్డేలు ట్వంటీలకు కూడా రేపో మాపో రిటైర్ మెంట్ ఇచ్చేస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కొన్నాళ్లు ఆగి ధోనీ పూర్తిగా రిటైరైన తర్వాత సంఘటనల్ని కలిపి తీద్దామా లేక 2011 వరల్డ్ కప్ విన్నింగ్ మొమెంట్స్ తో ముగిద్దామా అని ఆలోచిస్తున్నారట. కానీ పూర్తిగా రిటైరయ్యేవరకూ ఆగితే సినిమా చాలా లేట్ అయ్యే అవకాశం ఉండటంతో, 2011 ఫైనల్ తో సినిమాను ముగిస్తారని సమాచారం. ధోనీకే కాక, ఇండియాలోని క్రికెట్ అభిమానులందరికీ 2011 ఫైనల్ ఒక కల నిజమైన రోజు. ఆ ఫైనల్లో, విన్నింగ్ షాట్ గా ధోనీ సిక్స్ కొట్టడం విశేషం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.