English | Telugu

మెగా ఫ్యామిలీలో విభేధాలు మాయం..?

మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా చిన్నగా ఒకటవుతున్నట్టు కనిపిస్తుంది. గత కొద్దికాలంగా మెగా కాంపౌండ్ లో మెగా ఫ్యామీలీస్ మధ్య సఖ్యత అంతగా లేకపోవడం, పరస్పరం విభేధాలు ఉండటం అందరికి తెలుసు. దీనివల్ల చిరంజీవికి బాగానే తెలిసొచ్చినట్టు కనిపిస్తుంది. నిన్నటి మొన్నటి వరకూ చరణ్ బాగోగులు చూసిన చిరంజీవి ఇప్పుడు మళ్లీ అల్లు అరవిందునే అందుకు పురమాయించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం చరణ్ కు టైం అంత బాలేదు. ఈ మధ్య ఒక్క సరైన సినిమా కూడా లేదు. దీనికి కాస్తో, కూస్తో కారణం చిరంజీవి కూడా అయిండొచ్చు. సో మళ్లీ అది రిపీట్ అవ్వకుండా ఇక చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులను చూసుకోవాల్సిందిగా అల్లు అరవింద్ ను కోరారట.

అంతేకాదు ఎప్పటినుండో దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చిరు ఫ్యామిలికి దగ్గర అవుతున్నట్టు తెలుస్తోంది. గతం నుండే చరణ్ బాబాయ్ ను, నాన్నను కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇద్దరి మధ్య రాయబారిగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా కలుస్తుండేవాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి బర్త్ డే పార్టీకి రావడం.. బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి నటించినందుకు గాను ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలపడం ఇవన్నీ మెగా ఫ్యామిలీ ఒకటవుతుందని చెప్పడానికి నిదర్శనమే. అంతేకాదు చరణ్ కెరీర్ గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ తన సినిమాను సైతం కూడా పక్కన పెట్టి మరీ చరణ్ తో సినిమా తీయాలని త్రివిక్రమ్ కు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చరణ్ ఫెయిల్యూర్ వల్ల అందరూ ఒకటవుతున్నారు.. ఇది మెగా ఫ్యాన్స్ కు తీపి కబురే..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.