English | Telugu

వైజాగ్ కాదు హైదరాబాద్..అంతకు మించి షురూ

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)విశ్వంభర(Vishwambhara)తర్వాత అనిల్ రావిపూడి(Anil ravipudi)దర్సకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో అధికారకంగా ప్రారంభమైన ఈ మూవీపై చిరు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా జరుగుతున్నాయి.చిరు ఓల్డ్ సినిమా కట్ అవుట్ లతో ప్రారంభమైన ఈ ప్రమోషన్ హీరోయిన్ నయనతార(Nayanthara)వరకు చాలా వినూత్నంగా జరిగింది. దీంతో మూవీలో ఎంటర్ టైన్ మెంట్ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్ధమవుతుంది.

ఇక ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో స్టార్ట్ అవుతుందని, అనిల్ రావిపూడి అండ్ టీం ఆల్రెడీ అక్కడే ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది. చిరుతో పాటు ప్రధాన తారాగణంపై కొన్నికీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారకంగా వెల్లడి చేసింది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరు సినిమాని కూడా అంతకు మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. 2026 సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.