English | Telugu

మంచు బ్రదర్స్ కబడ్డీ: మనోజ్ టీమ్ విజేత

తెలుగు సినీ చిత్రపరిశ్రమ చేపట్టిన ‘మేముసైతం’ కార్యక్రమంలో భాగంగా మంచి ఫ్యామిలీ కబడ్డీ జట్టు మొత్తం కార్యక్రమానీకే హైలైట్ గా నిలిచింది.కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మంచు విష్ణు, మంచు మనోజ్ టీంలు తలపడ్డాయి. మనోజ్ టీంలో బ్రహ్మానందం చేసిన హంగామా వీక్షకులకు వినోదం అందించింది. రిఫరీగా మంచు మోహన్ బాబు, వ్యాఖ్యాతగా విక్టరీ వెంకటేష్ ల సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో మంచు మనోజ్ టీమ్ రెండు పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.