English | Telugu

ఈ సంక్రాంతికి 'సూప‌ర్‌' వార్‌

మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలుగు చిత్ర‌సీమ‌కు రారాజులుగా వెలిగిపోతున్నారు. పారితోషికం విష‌యంలోనూ, క్రేజ్ విష‌యంలోనూ, అభిమానగ‌ణం విష‌యంలోనూ ఎవ్వ‌రికీ ఎవ్వ‌రూ తీసిపోరు. వీరి సినిమాలు విడుద‌ల అవుతున్నాయంటే బాక్సాఫీసుకు పండ‌గే. అలాంటిది మ‌హేష్, ప‌వ‌న్ ఇద్ద‌రూ ఒకేసారి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఢీ కొట్టుకొంటే ఎలా ఉంటుంది...? పండ‌గ‌ల‌న్నీ ఫ్యామిలీ ప్యాక్ ఆఫ‌ర్‌లా వ‌చ్చేసినంత సంబ‌రంగా ఉంటుంది. ఈ క‌ల త్వ‌ర‌లోనే నిజం కాబోతోంది. మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం, ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌హేష్ - శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్లో బ్ర‌హ్మోత్స‌వం ప‌ట్టాలెక్కేసింది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు గ‌బ్బ‌ర్ సింగ్ 2 కూడా స్టార్ట‌య్యింది. దీనికీ ముహూర్తం ఫిక్స‌య్యింది. ఈసినిమానీ సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని ప‌వ‌న్ ఫిక్స‌య్యాడ‌ట‌. అంటే 2016 సంక్రాంతి.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఇద్ద‌రు స్టార్ల సూప‌ర్ వార్ చూసేయొచ్చ‌న్న‌మాట‌. మ‌హేష్‌కి సంక్రాంతి సీజ‌న్ బాగానే క‌లిసొచ్చింది. ప‌వ‌న్ కూడా ఈ యేడాది సంక్రాంతికే గోపాల గోపాల హిట్ ఇచ్చాడు. మ‌రి వీరిద్ద‌రూ ఢీ కొట్టుకొనే 2016 పండ‌క్కి విజేత‌గా నిల‌బ‌డేది ఎవ‌రో..?? నిర్ణ‌యించాల్సింది తెలుగు ప్రేక్ష‌కులే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.